ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..
ABN , First Publish Date - Jan 23 , 2026 | 06:59 AM
ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jan 23, 2026 18:07 IST
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లీగల్ నోటీసులు
నిరాధార ఆరోపణలు చేసి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారని స్పీకర్ ఆగ్రహం
తనకు రూ.10కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న గడ్డం ప్రసాద్
-
Jan 23, 2026 18:02 IST
ముగిసిన మిధున్ రెడ్డి ఈడీ విచారణ
ఏడు గంటల పాటు మిధున్ రెడ్డిని విచారించిన ఈడీ
కోర్టు ఉత్తర్వులు ఉన్న కారణంగా ఏపీ లిక్కర్ స్కాంపై ఏమీ మాట్లాడలేనన్న మిథున్ రెడ్డి
-
Jan 23, 2026 18:00 IST
7 గంటలుగా కొనసాగుతున్న కేటీఆర్ సిట్ విచారణ
జూబ్లీహిల్స్ పీఎస్లో కేటీఆర్ను విచారిస్తున్న సిట్ అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
-
Jan 23, 2026 17:58 IST
ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించాలన్నదే నా సంకల్పం: మంత్రి తుమ్మల
ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నగరం పరిశుభ్రంగా లేకపోతే.. రూ.కోట్లు పెట్టిన ప్రయోజనం ఉండదు: తుమ్మల
ప్రణాళికబద్ధంగా పనులు సాగితే ఇంకో రూ.100కోట్లు ఇస్తా: తుమ్మల
-
Jan 23, 2026 17:48 IST
రిపబ్లిక్ డే.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు!
యూపీలోని శివనాడార్ పాఠశాల సహా గుజరాత్లోని సెయింట్ కబీర్, సెయింట్ జేవియార్ స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్
అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టిన అధికారులు
ఆ స్కూళ్లకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపిన పాఠశాల యాజమాన్యం
-
Jan 23, 2026 17:34 IST
తీవ్ర విషాదం.. స్కూల్లో జింక బొమ్మ మీద పడి చిన్నారి మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి పెదపూడి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం
స్కూల్ ఆవరణలో జింక బొమ్మపై ఆడుతూ ప్రమాదవశాత్తు అది మీద పడి చిన్నారి జాహ్నవి(7) దుర్మరణం
-
Jan 23, 2026 17:30 IST
గోదావరి పుష్కర పనులపై ఏపీ సీఎం సమీక్ష
జూన్ 2027లో 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలు
ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించనుండటం నా అదృష్టం: చంద్రబాబు
పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి: చంద్రబాబు
దేశవిదేశాల నుంచి సుమారు 10కోట్ల మంది పుష్కరాలకు వస్తారని అంచనా
-
Jan 23, 2026 17:25 IST
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
మేడారం జాతరకు రూ.3.70కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం
భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిధుల విడుదల
రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం రూ.140 కోట్లు వెచ్చిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
-
Jan 23, 2026 17:11 IST
విశాఖ రైల్వే స్టేషన్లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురు సునీల్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీష్ కుమార్ నుంచి నకిలీ కరెన్సీ స్వాధీనం
నిందితుల నుంచి రూ.3.32 లక్షల స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jan 23, 2026 17:09 IST
దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం
రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం
జనగణనలోనే కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న తొలి దశ జనగణన
తొలిదశలో గృహ గణన కోసం ప్రశ్నావళిని రూపొందించిన కేంద్ర హోం శాఖ
33 ప్రశ్నలతో గెజిట్ విడుదల చేసిన కేంద్రం
-
Jan 23, 2026 17:01 IST
రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న అమరావతి
అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు
రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు
-
Jan 23, 2026 16:55 IST
సైనా నెహ్వాల్ను చూసి దేశం గర్విస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు
బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ట్వీట్
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో బంగారు అధ్యాయాన్ని సైనా లిఖించింది: చంద్రబాబు
ఆమె సాధించిన విజయాలు యువతను బ్యాడ్మింటన్ కోర్టు వైపు నడిపించాయి: చంద్రబాబు
-
Jan 23, 2026 16:49 IST
ట్రెండింగ్లో ‘హ్యాపీ బర్త్డే మన లోకేశ్’
ఏపీ మంత్రి నారా లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు
ఎక్స్లో ట్రెండింగ్లో ఉన్న ‘హ్యాపీ బర్త్డే మన లోకేశ్’
దేశవ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోన్న లోకేశ్ హ్యాష్ట్యాగ్
-
Jan 23, 2026 16:29 IST
కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్షీట్
తిరుమల కల్తీ నెయ్యి కేసులో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్
మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చిన సిట్
వీరిలో 12 మంది టీటీడీ అధికారులు
-
Jan 23, 2026 16:23 IST
నంద్యాల జిల్లాలో రైల్వే ట్రాక్పై మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా నూనెపల్లి రైల్వే ట్రాక్పై మృతదేహం లభ్యం
ఉడుమల్పురం గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డిగా గుర్తించిన పోలీసులు
హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
-
Jan 23, 2026 16:12 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద ముగింపు
241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడిన నిఫ్టీ
-
Jan 23, 2026 16:07 IST
అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన 233, 244 ఎస్ఎల్బీసీ సమావేశం
రాష్ట్రంలో ఎవరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు: చంద్రబాబు
వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దే రుణాలు తీసుకోవాలి: చంద్రబాబు
-
Jan 23, 2026 16:02 IST
కల్తీ మద్యం కేసు.. జోగి బ్రదర్స్కు బెయిల్ మంజూరు
కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్, జోగి రాముకు బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు
ములకల చెరువు కేసులో జోగి బ్రదర్స్కు బెయిల్ మంజూరు
ఇటీవలే ఇబ్రహీంపట్నం కేసులోనూ బెయిల్ ఇచ్చిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు
-
Jan 23, 2026 15:59 IST
సీతక్క పర్యటనలో ఉద్రిక్తత
జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి మధ్య ఘర్షణ
ఇరువర్గాల మధ్య తోపులాట.. రంగంలోకి దిగిన పోలీసులు
-
Jan 23, 2026 15:56 IST
ఐదు గంటలుగా కొనసాగుతోన్న మిథున్ రెడ్డి ఈడీ విచారణ
రెండున్నర గంటలకు భోజన విరామం ఇచ్చిన ఈడీ అధికారులు
భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన మిథున్ రెడ్డి విచారణ
ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శర్వాణి ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు
-
Jan 23, 2026 15:54 IST
కొండగట్టులో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు యువ నేతల ప్రత్యేక పూజలు
హైదరాబాద్ నుంచి 30 వాహనాల్లో ర్యాలీగా వచ్చి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తెలుగు యువ నేతలు
అంజన్న ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని కోరిన యువ నేతలు
-
Jan 23, 2026 15:50 IST
తిరుమల రథసప్తమి వేడుకలకు భారీ బందోబస్తు: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
రథసప్తమి సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: ఏబీఎన్తో వెంకయ్య చౌదరి
400 మంది టీటీడీ సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించాం: వెంకయ్య చౌదరి
ఏఐ టెక్నాలజీ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పర్యవేక్షిస్తాం: వెంకయ్య చౌదరి
-
Jan 23, 2026 15:29 IST
ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం
బుట్టాయగూడెం మండలం నాగుల గూడెం వద్ద ట్రాప్ కెమెరాకు చిక్కిన పెద్దపులి
ఆవును చంపి దాని పక్కనే కూర్చున్న పెద్దపులి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అటవీశాఖ అధికారులు
-
Jan 23, 2026 15:25 IST
టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే.. బంగ్లాకు ఎంత నష్టమంటే?
టీ20 ప్రపంచ కప్ భారత్లో ఆడబోమని తేల్చి చెప్పిన బంగ్లా క్రికెట్ బోర్డు
తక్కువ సమయం ఉండటంతో వేదికల మార్పు కుదరని చెప్పిన ఐసీసీ
ఈ టోర్నీ నుంచి బంగ్లా వైదొలిగితే.. బీసీబీకి సుమారు రూ.240 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం
-
Jan 23, 2026 15:07 IST
ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: టీపీసీసీ చీఫ్
ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే: మహేశ్ కుమార్
సొంత చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతున్నా కేటీఆర్ నుంచి సమాధానం లేదు: మహేశ్ కుమార్
-
Jan 23, 2026 14:54 IST
ఈడెన్ గార్డెన్స్కు ఐసీసీ రేటింగ్
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2026
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని పరిశీలించిన ఐసీసీ, బీసీసీఐ బృందం
స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్ను పరిశీలించి ‘సంతృప్తికరం’ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ
-
Jan 23, 2026 14:50 IST
నారా లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్కు అంకితభావంతో సేవ చేయడంలో తనకు మంచి ఆరోగ్యం, నిరంతర విజయం లభించాలని కోరిన చిరంజీవి
లోకేశ్ ప్రయాణం సానుకూల మార్పును, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని ఎక్స్ వేదికగా పోస్ట్
-
Jan 23, 2026 13:36 IST
వివాదాస్పదంగా మారిన అమెరికా వలసల శాఖ అధికారుల తీరు
మిన్నెసొటాలో ఐదేళ్ల చిన్నారి లియమ్ను అదుపులోకి తీసుకున్న అధికారులు
అక్రమ వలసదారుడు ఏడ్రియన్ అలెగ్జాండర్ ఆరియాస్తోపాటు అతని కుమారుడినీ అదుపులోకి తీసుకున్న వైనం
ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు
ఘటనపై మండిపడిన అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్
-
Jan 23, 2026 13:29 IST
వైద్య రంగంలో దూకుడు పెంచుతున్న టెక్ కంపెనీలు
ఏఐ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇచ్చేందుకు ముందడుగు
ఇటీవల చాట్జీపీటీ హెల్త్ను ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ సంస్థ
చాట్బాట్ జెమినై ద్వారా తాము సేవలందిస్తామంటున్న గూగుల్
ఎస్ఏటీ పరీక్షకు సంబంధించిన ఉచిత మాక్ టెస్టులు పొందొచ్చని ప్రకటన
ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆల్ఫ్బెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్
-
Jan 23, 2026 13:29 IST
నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
నిందితుల రిమాండ్ ఫిబ్రవరి 5 వరకు పొడిగించిన ఎక్సైజ్ కోర్టు
నిందితులను వర్చువల్గా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
భవానీపురం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్కు ఇప్పటికే బెయిల్ మంజూరు
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి బ్రదర్స్
-
Jan 23, 2026 13:28 IST
అమరావతి: రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం
గతంలో కేటాయించిన స్థానంలోనే ప్లాట్లు ఇస్తున్నారని రైతుల ఆగ్రహం
గతంలో వద్దన్న భూముల్లోనే ప్లాట్లు ఇవ్వడంపై అభ్యంతరం
తమకు ప్లాట్లు అవసరం లేదంటున్న రాజధాని రైతులు
అభ్యంతరాలున్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేత
-
Jan 23, 2026 13:27 IST
కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా సాగదీస్తున్నారు: బండి సంజయ్
ట్యాపింగ్ చేసినవారినే.. ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు: బండి సంజయ్
ట్యాపింగ్కు కారణమైన ప్రభాకర్రావును కాపాడుతున్నారు: బండి సంజయ్
AICC భవన్-ఫామ్హౌస్ మధ్య డీల్ కుదరలేదు: బండి సంజయ్
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలంటే రేవంత్ భయపడుతున్నారు: సంజయ్
-
Jan 23, 2026 13:27 IST
కేటీఆర్ను ఏ అంశంలో ప్రశ్నిస్తున్నారో స్పష్టం చేయాలి: బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు: బండి సంజయ్
BRS హయాంలో ట్యాపింగ్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల దందా జరిగింది: బండి సంజయ్
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధి పొందారో అందరికీ తెలుసు
తన ఫోన్ ట్యాప్ అయిందని సీఎం కూడా చెప్పారు: బండి సంజయ్
-
Jan 23, 2026 13:25 IST
ఫోన్ట్యాపింగ్ డైలీ సీరియల్లా నడుస్తోంది: బండి సంజయ్
విచారణ పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది: బండి సంజయ్
కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు: బండి సంజయ్
సిట్ అధికారులకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం లేదు: బండి సంజయ్
అసలు కేటీఆర్ను ఎందుకు పిలిచారు?: కేంద్రమంత్రి బండి సంజయ్
-
Jan 23, 2026 13:25 IST
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: RS ప్రవీణ్కుమార్
కాళేశ్వరం విషయంలోనూ BRSను బద్నాం చేశారు: RS ప్రవీణ్
ఫార్ములా-ఈ కేసులో అసలు ఏం తేల్చారు?: RS ప్రవీణ్కుమార్
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: RS ప్రవీణ్కుమార్
ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాప్ చేయడం సర్వసాధారణం: RS ప్రవీణ్
-
Jan 23, 2026 13:25 IST
ఆత్మగౌరవం కాపాడేందుకే: RS ప్రవీణ్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు BRS పోరాడుతోంది: RS ప్రవీణ్
అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: RS ప్రవీణ్కుమార్
తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతున్నారు: RS ప్రవీణ్
నైనీ కోల్ బ్లాక్ దోపిడీని ప్రశ్నించినందుకే కేసులు: RS ప్రవీణ్కుమార్
-
Jan 23, 2026 13:23 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నిస్తోన్న సిట్ బృందం
కేటీఆర్, టాస్క్ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్రావును కలిపి ప్రశ్నిస్తోన్న సిట్
వ్యాపారవేత్తలను బెదిరించి BRSకు విరాళాలు ఇప్పించిన వ్యవహారంపై ఆరా
BRS పార్టీ ఆర్థిక లావాదేవీలపై కేటీఆర్ను ప్రశ్నిస్తోన్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు
-
Jan 23, 2026 12:54 IST
వైద్య రంగంలో దూకుడు పెంచుతున్న టెక్ కంపెనీలు
ఏఐ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇచ్చేందుకు ముందడుగు
ఇటీవల చాట్జీపీటీ హెల్త్ను ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ సంస్థ
చాట్బాట్ జెమినై ద్వారా తాము సేవలందిస్తామంటున్న గూగుల్
ఎస్ఏటీ పరీక్షకు సంబంధించిన ఉచిత మాక్ టెస్టులు పొందొచ్చని ప్రకటన
ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆల్ఫ్బెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్
-
Jan 23, 2026 12:44 IST
ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్లో బుల్లెట్ గుర్తింపు
తనిఖీల్లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు
తూటాను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగింత
-
Jan 23, 2026 12:28 IST
తారస్థాయికి చేరిన పొలిటికల్ వార్
అనంతపురం: తాడిపత్రిలో తారస్థాయికి చేరిన రాజకీయ పోరు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కొనసాగుతున్న వార్
ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం
రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్
మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్
-
Jan 23, 2026 12:20 IST
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం
కేరళ: మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం నుంచి దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం
తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి- తిరువనంతపురం సూపర్ఫాస్ట్ సైతం ప్రారంభం
ఇప్పటికే చర్లపల్లి- ముజఫర్పూర్ మధ్య నడుస్తున్న అమృత్ భారత్ రైలు
తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండో రైలు కావడం విశేషం
-
Jan 23, 2026 12:15 IST
చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి
నేడు ఒక్కసారిగా ఎగబాకిన గోల్డ్, సిల్వర్ రేట్లు
10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.5400 మేర పెరిగి రూ.1.60లక్షలకు చేరువ
ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710
ఏకంగా రూ.20 వేల మేర పెరిగిన వెండి ధర
నేడు రూ.3.6 లక్షలకు చేరిన సిల్వర్ రేటు
-
Jan 23, 2026 11:59 IST
సంచలన తీర్పు..
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేసిన హైకోర్టు
-
Jan 23, 2026 11:54 IST
భారీగా కురుస్తున్న మంచు
జమ్మూకశ్మీర్: రాజౌరిలోని తన్నమండి ప్రాంతంలో భారీగా కురుస్తున్న మంచు
పిర్ పంజాల్ పర్వత శ్రేణుల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న మంచువాన
-
Jan 23, 2026 11:50 IST
నేడు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినం
మంత్రి లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ
లోకేశ్కు పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు
లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత
-
Jan 23, 2026 11:16 IST
నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ABNతో వేముల వీరేశం
తెలంగాణకు డ్రగ్, పబ్ కల్చర్ తెచ్చింది కేటీఆరే: వేముల వీరేశం
త్వరలో కేసీఆర్ను కూడా విచారణకు పిలుస్తారు: ఎమ్మెల్యే వేముల
ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ పరువు తీశారు: ABNతో వేముల వీరేశం
-
Jan 23, 2026 11:13 IST
నంద్యాల విజయ డైయిరీ డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్
శాంతిభద్రతల దృష్టా ఎన్నికలు వాయిదా వేయాలని అంటున్న పోలీసులు
శాంతినగరం సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నికకు నామినేషన్ వేసేందుకు వచ్చిన గంగుల ప్రమీలా రాణి
ఎన్నిక వాయిదా వేస్తున్నారనడంతో డెయిరీ దగ్గర గంగుల ప్రమీలా రాణి బైఠాయింపు
ఎన్నిక జరపకుండా వాయిదా వేయడంపై సమాధానం చెప్పాలని ప్రమీలా రాణి డిమాండ్
-
Jan 23, 2026 11:07 IST
ఈడీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ..
హైదరాబాద్: ఈడీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో మిథున్రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్న ఈడీ
-
Jan 23, 2026 11:06 IST
రాజకీయ ప్రేరేపితం: హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రేరేపిత కేసు: హరీష్రావు
BRS నేతలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోంది: హరీష్రావు
-
Jan 23, 2026 11:05 IST
విచారణకు హాజరైన కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
కేటీఆర్ను ప్రశ్నిస్తోన్న జాయింట్ సీపీ విజయ్కుమార్, ACP వెంకటగిరి
BRS ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తోన్న సిట్ బృందం
కేటీఆర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో విచారణ
-
Jan 23, 2026 11:04 IST
తెలంగాణకు అమృత్ భారత్ రైలు..
తెలంగాణకు తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
చర్లపల్లి-తిరువనంతపురం మధ్య సూపర్ఫాస్ట్ రైలు
నేడు తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్న మోదీ
-
Jan 23, 2026 11:03 IST
పెద్దారెడ్డిపై కేసు
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డిపై టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు
అనంతపురం, తాడిపత్రి పీఎస్లలో కేతిరెడ్డిపై కేసులు
-
Jan 23, 2026 11:03 IST
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి టెన్షన్.. టెన్షన్..
జేసీ ప్రభాకర్రెడ్డి, కేతిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపు
రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు పెద్దారెడ్డి సవాల్
పెద్దారెడ్డి ఇంటి దగ్గర చర్చకు సిద్ధమన్న జేసీ ప్రభాకర్రెడ్డి వర్గం
పోలీసుల ఆధీనంలో ఇద్దరు నేతల ఇళ్ల మధ్య ఉన్న కాలేజీ గ్రౌండ్
నిన్న కాలేజీ గ్రౌండ్లో ఉన్న రాళ్ల డంప్ను తొలగించిన పోలీసులు
-
Jan 23, 2026 11:01 IST
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
ఒక్కరోజే రూ.5,400 పెరిగిన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400
కిలోపై రూ.20వేలు పెరిగి రూ.3,60,000కి చేరిన వెండి
-
Jan 23, 2026 11:00 IST
నెల్లూరు: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ
ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయనున్న సిట్
12 రాష్ట్రాల్లో 15 నెలలు కొనసాగిన సిట్ విచారణ
బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు కీలక సూత్రధారులుగా గుర్తింపు
తొలి చార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్
మరో 12 మంది హస్తం ఉన్నట్టు కోర్టుకు తెలిపిన అధికారులు
-
Jan 23, 2026 10:59 IST
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మిథున్రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో మిథున్రెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ
విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై ఆరా
నిన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ అధికారులు
-
Jan 23, 2026 10:59 IST
నేడు సుభాశ్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన ప్రధాని మోదీ
భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశభక్తికి నేతాజీ ప్రతీక అని అభివర్ణన
నేతాజీ జయంతిని దేశం పరాక్రమ్ దివస్గా జరుపుకుంటోందని ప్రశంస
రాబోయే తరాలకు నేతాజీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎక్స్ వేదికగా కొనియాడిన ప్రధాని
-
Jan 23, 2026 10:56 IST
నా కుటుంబ సభ్యులను దూరం చేసేందుకు చూశారు: కేటీఆర్
రెండేళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు?: కేటీఆర్
ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్రం కోసం పోరాడుతాం: కేటీఆర్
నా పరువుకు భంగం కలిగించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను: కేటీఆర్
-
Jan 23, 2026 10:56 IST
హామీలు, స్కామ్ల నుంచి డైవర్షన్ కోసమే కుట్రలు: కేటీఆర్
కాంగ్రెస్ను బొంద పెట్టేవరకు నిద్రపోం: కేటీఆర్
విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా: కేటీఆర్
రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్
నేను రాష్ట్రం కోసం పనిచేశా.. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు: కేటీఆర్
-
Jan 23, 2026 10:47 IST
ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధం లేదు: కేటీఆర్
విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా: కేటీఆర్
ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా: కేటీఆర్
అటెన్షన్ డైవర్షన్ కోసమే కుట్రలు చేస్తున్నారు: కేటీఆర్
మంత్రులతో సహా మా అందరి ఫోన్లు రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారు: కేటీఆర్
-
Jan 23, 2026 10:46 IST
హైదరాబాద్: కాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్కు కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ను ప్రశ్నించనున్న జాయింట్ సీపీ విజయ్కుమార్, ACP వెంకటగిరి
కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ పీఎస్కు హరీష్రావు
జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
-
Jan 23, 2026 09:11 IST
బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వసంత పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం
తెల్లవారుజామునే అమ్మవారికి మంగళ వాయిద్య, సుప్రభాత సేవలు
ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
-
Jan 23, 2026 07:41 IST
నేడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం
లోకేశ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన సతీమణి నారా బ్రాహ్మణి
బాధ్యతతోపాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు: నారా బ్రాహ్మణి
మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం: నారా బ్రాహ్మణి
మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి: నారా బ్రాహ్మణి
ఈ ఏడాది మీకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా: నారా బ్రాహ్మణి
నిత్యం మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి
-
Jan 23, 2026 07:24 IST
మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్
ఐరోపా దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ట్రంప్ నిర్ణయంతో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు
భారత్లో పసిడి ధర సుమారు రూ.2,200, వెండి రూ.5,000లు తగ్గుదల
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,41,440
-
Jan 23, 2026 07:18 IST
దావోస్ లో తెలుగు నేతలు భేటీ..
స్విట్జర్లాండ్: దావోస్ వేదికగా భేటీ అయిన సీఎం రేవంత్, ఏపీ మంత్రి లోకేశ్
ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో ఇరువురు నేతల కీలక సమావేశం
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టీకరణ
ఈ సందర్భంగా రేవంత్ను మంగళగిరి శాలువాతో సత్కరించిన మంత్రి లోకేశ్
-
Jan 23, 2026 06:59 IST
దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి రానున్న చంద్రబాబు
టాటా ప్రాజెక్టులపై ‘టాటా సన్స్’ చైర్మన్కు సీఎం చంద్రబాబు వినతి
దావోస్లో చంద్రశేఖరన్తో మర్యాదపూర్వక భేటీ
స్పోర్ట్స్ సిటీల్లో పెట్టుబడులకూ చంద్రశేఖరన్ సానుకూలత
గతేడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
తాజా పర్యటనతోనూ సత్ఫలితాలే: చంద్రబాబు
4 రోజుల పర్యటన ముగించుకుని వెనక్కి