తాడిపత్రిలో హైటెన్షన్.. పోలీసుల ఆధీనంలో కాలేజీ గ్రౌండ్
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:57 AM
తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
అనంతపురం, జనవరి 23: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే బహిరంగ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
దీంతో తాడిపత్రిలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల నివాసాల మధ్యనున్న కాలేజీ గ్రౌండ్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఆ గ్రౌండ్లో ఉన్న రాళ్ల డంప్ను ఇప్పటికే తొలగించారు. అలాగే పట్టణంలో ఆయా చోట్ల భారీగా మోహరించారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?
ఈ రోజే వసంత పంచమి.. ఈ విషయాలు తెలుసా?
For More AP News And Telugu News