Home » JC Prabhakar Reddy
ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తన కుమారుడు అన్నారని.. అయితే ఈ మాటలను కొంతమంది జర్నలిస్టులు వక్రీకరిస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
రాయలసీమకు పౌరుషం లేదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు.
తాడిపత్రి పట్టణం అన్ని విధాలుగా బాగుండాలన్నదే తన అభిమతమని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...న్యూఇయర్ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నామనీ, ఆమె వస్తారో.. రారో.. తెలియదన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.