Share News

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

ABN , Publish Date - May 09 , 2025 | 07:56 PM

MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు
MP Raghunandan Rao

ఖమ్మం జిల్లా: పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై గత మూడు రోజులుగా ఆపరేషన్ సిందుర్ కొనసాగుతోందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇవాళ(శుక్రవారం) ఖమ్మంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా వన్ నేషన్...వన్ ఎలక్షన్‌పై అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఆపరేషన్ సిందూర్ అవసరమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు.


జమ్మూకశ్మీర్‌లో కులం అడిగి అడబిడ్డల ముందే భర్తను చంపితే ఏం చేయాలని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. ఇజ్రాయిల్ తమ దేశ పౌరులపై బాంబులు వేసిందని గాజా అనే పట్టణం లేకుండా ఇజ్రాయిల్ చేసిందని గుర్తుచేశారు. పాకిస్థాన్ పైశాచికత్వానికి గట్టిగా సమాధానం చెబుతున్నామని అన్నారు. భారతదేశం యుద్ధం చేయాలనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్థాన్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇద్దరు ఆడబిడ్డల నాయకత్వంలో పాకిస్తాన్‌పై దాడులు చేశామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.


పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు, మదర్సాలు, పాకిస్థానీలను, బంగ్లాదేశ్ వాళ్లని వెంటనే ఏరి బయటకు పంపించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు పలకడమని అన్నారు. ప్రభుత్వ సొమ్ము తింటున్న ఫ్రొఫెసర్లును ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడితే దేశ ద్రోహం కిందకు వస్తుందని.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.


Also Read:

Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2025 | 08:01 PM