Home » Indians
ఇరాన్లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.
రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టును శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది.
మయన్మార్లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి రామ్మోహన్ లేఖ రాశారు..
రష్యన్ ఆర్మీలో చేరిన 10 మంది భారతీయులు మృతి చెందారని పంజాబ్కు చెందిన జగ్దీప్ కుమార్ ఆరోపించారు. తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్లిన జగ్దీప్ తిరిగివచ్చి ఈ వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు.
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు రణ్ధీర్ జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్కు తీసుకువచ్చారు.
అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్లో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు 'ఆపరేషన్ సింధు' పేరుతో వారిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.