ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:50 AM
ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16నుంచి 31వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15గంటలకు 07197 ప్రత్యేక రైలు, ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు కొట్టాయం నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, తిరుపూర్, పోడనూర్, పాలక్కడ్, త్రిశూర్, అలువ, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలుకు సెకండ్ ఏసీ, థర్డ్ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ క్లాస్ బోగీలు కూడా ఉంటాయని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
నకిలీ ట్రేడింగ్ యాప్తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News