Home » Secundrabad
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి-సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై ఆరెంజ్ కలర్లో రాకపోకలు కొనసాగించనుంది. అలాగే.. 16 బోగీలుండగా మరో నాలుగు బోగీలను చేర్చి మొత్తం 20 బోగీలు ఏర్పాటు చేశారు.
నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కుక్కల వల్ల ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి రోజూ 74 ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.