Home » Secundrabad
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలుకు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్హెచ్బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాచిగూడ-యశ్వంత్పూర్ వందేభారత్ (20703/04) ఎక్స్ప్రెస్కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
ముజఫర్పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు.
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ మంగళవారం నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది.