Share News

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:30 AM

తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు.

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేడు, రేపు నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైలు (07296 నెంబర్‌) శుక్రవారం రాత్రి 7.40గంటలకు తిరుపతిలో బయల్దేరుతుందని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు(Chirala, Bapatla, Tenali, Guntur), మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి మీదుగా శనివారం ఉదయం 9.30గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.


city2.2.jpg

మరో ప్రత్యేక రైలు (07297 నెంబర్‌) గురువారం రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని నడుపుతున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ

సూపర్‌ పవర్‌ అంతా ఈజీ కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2025 | 07:44 AM