Home » Machilipatnam
మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏసుప్రభువు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పుకొచ్చారు.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణం చేసి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
ప్రతి సంవత్సరం పాండురంగడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- బైక్ ఢీకొని 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మచిలీపట్నం పోలీసులు యాక్షన్ చేపట్టడంతో మాజీ మంత్రి పేర్ని నాని దిగొచ్చారు. ఈ క్రమంలో పేర్ని నానితో సహా మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి క్యూ కట్టారు వైసీపీ నేతలు.
గతంలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిరసనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని నిరసనకు వెళ్తున్నారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.