Home » Machilipatnam
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై వచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.
మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
బందరు పోర్టును గోగిలేరుకు తరిమేసేందుకు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో బందరు పోర్టు కోసం తామంతా ఉద్యమాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళన చేశారని మండిపడ్డారు.
వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.
మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు(మంగళవారం) బైకుపై వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటిని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ సంఘం ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు.