Home » Machilipatnam
రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం ప్రముఖుల పేర్లు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
మచిలీపట్నం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బందర్ పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
మచిలీపట్నంలో 180 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.
మచిలీపట్నంలో పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టి దారుణానికి ఒడికట్టాడు.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.