రేవంత్రెడ్డి షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం: కేటీఆర్
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:41 PM
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అనుముల కొండల్రెడ్డి టెస్రాక్ట్ (Tesract) సంస్థకు చైర్మన్గా ఉన్నానని ఆయనే చెప్పారని అన్నారు. రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లతో కంపెనీలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టెస్రాక్ట్ కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా లేరని.. లక్ష రూపాయలతో ఆ కంపెనీ పెట్టడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. రూ.2వేల కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.7 వేల కోట్లకు కేటాయించారని ప్రస్తావించారు. ఆ కంపెనీకి కొండల్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎలా చెబుతారని నిలదీశారు.
శ్రీధర్బాబుకి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియదా..?
శ్రీధర్బాబుకి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియదా.? లేక సీఎం వత్తిడికి తలొగ్గారా.? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం సీఎం భార్యకు మూడెకరాలను కేటాయించడంపై కేసు నమోదైందని ప్రస్తావించారు. ముడా స్కాంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎనుముల కొండల్రెడ్డి టెస్రాక్ట్ సంస్థకు చైర్మన్గా ఉన్నానని ఆయనే పేర్కొన్నారు. కొండల్రెడ్డికి ఆ సంస్థతో సంబంధం లేకుంటే యూఎస్ కౌన్సిల్ మీటింగ్కి ఎలా వెళ్లారని నిలదీశారు. ఈ భూ కేటాయింపులను వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిరెడ్డి ఏ హోదాలో అధికారిక సమావేశాలకు వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలకు పట్టాలు ఏ హోదాలో ఇస్తారని నిలదీశారు. రాష్ట్ర గవర్నర్ను కలిసి ఈ విషయంపై విచారణ జరపాలని కోరతామని పేర్కొన్నారు.
అర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తాం..
తెలంగాణలో రూ.74 లక్షల ఓట్లు తొలగిస్తారనేది ఆందోళనకరమైన విషయమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత తమ పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తామని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా.?, లేదా.? స్పష్టం చేయాలన్నారు. జలసౌదాలో జరిగే జీఆర్ఎంబీ అజెండాను మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తామని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం చెప్పినా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వరుణ యాగం చేయడం తప్పు కాదు కానీ ఈ ప్రభుత్వం చేయాల్సిన పనిని సక్రమంగా చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News