Home » Kalvakuntla Taraka Rama Rao
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్కి 38 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్రెడ్డి.
కేటీఆర్తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్రెడ్డి.