సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వారికి హైకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:17 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఏం చెప్పిదంటే..
వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి. గిరీష్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కుప్పం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే, గతంలో ఈ కేసును విచారించిన కుప్పం స్థానిక కోర్టు, వారికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోలీసులు వెంటనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఉన్నత న్యాయస్థానం దాని విచారణకు స్వీకరించింది. రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించేందుకు అనుమతినిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు గట్టి వాదనలు వినిపించారు.
సోషల్ మీడియా పోస్టులపై పెరిగిన నిఘా
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులపై, ముఖ్యంగా మహిళా నేతలు, ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే సహించేది లేదని హైకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారికి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News