Home » YSRCP Cadre
ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటూ అభివర్ణించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ వేదికగా ఎన్డీఏ కూటమి పవర్ ప్యాక్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీచ్తో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ఆరంభమైన కాసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పరామర్శించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.
ఇబ్రహీంపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఏబీఎన్లో మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన కామెంట్స్ వచ్చిన వెంటనే తమ నేత ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయని ఆరోపణలు చేశారు.