-
-
Home » Mukhyaamshalu » ABN Andhrajyothy ap telangana national and international viral trending live updates of 5th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 05 , 2026 | 06:11 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 05, 2026 21:47 IST
తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం.
మరోవైపు శనివారం, ఆదివారం.. రెండు రోజుల పాటు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్.
జనసేన, బీజేపీ అభ్యర్థుల తరుపున పవన్ ప్రచారం.

-
Feb 05, 2026 21:38 IST
శుక్రవారం సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
కేసు విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం
ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామన్న ధర్మాసనం.
అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం.
తదుపరి విచారణ నాటికి స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని కోర్టుకు తెలపాలి: సుప్రీంకోర్టు
-
Feb 05, 2026 21:27 IST
మేడారం హుండీల లెక్కింపు
మొత్తం 828 హుండీల్లో తొలిరోజు 125 హుండీలు లెక్కింపు.
తొలిరోజు హుండీల లెక్కింపులో రూ.2,49,65,000 ఆదాయం.
-
Feb 05, 2026 20:42 IST
సీఎం రేవంత్ వ్యాఖ్యలను ప్రజలు ఛీకొడుతున్నారు: హరీష్రావు
కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్ విషం కక్కుతున్నారు.
కేసీఆర్ను జాతిపితగా పిలుచుకుంటే రేవంత్కు ఏంటి నొప్పి.
పాలన చేతకాక రేవంత్రెడ్డి నిరాశ, నిస్పృహలో ఉన్నారు.
-
Feb 05, 2026 20:39 IST
సిరిసిల్ల: హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు: కేటీఆర్
దేవుళ్ల పేర్లు చెప్పుకుని బీజేపీ ఓట్లు అడుగుతోంది: కేటీఆర్
కాంగ్రెస్కు ఓటు వేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు: కేటీఆర్
-
Feb 05, 2026 20:38 IST
అంబటి రాంబాబు పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ
తనపై కేసు కొట్టివేయడంతో పాటు రిమాండ్ రిపోర్ట్ను సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు పిటిషన్
తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా.
-
Feb 05, 2026 19:43 IST
మేఘాలయలో ఘోర ప్రమాదం, 16 మంది మృతి
తూర్పు జయంతియా హిల్స్ బొగ్గు గనిలో పేలుడు.
-
Feb 05, 2026 18:41 IST
రాహుల్ గాంధీకి గర్వం తలకెక్కింది: ప్రధాని మోదీ
కాంగ్రెస్ నుంచి ఎంతోమంది పార్టీ వీడి వెళ్లిపోయారు.
ఇదే సభలో ఓ ఎంపీని రాహుల్ ద్రోహి అన్నారు.
బిట్టు సిక్కు కావడంతో అతన్ని అవమానించారు.
సిక్కుల పట్ల కాంగ్రెస్కున్న ద్వేషం వారి మాటల్లో కనిపించింది.
ప్రతి విషయంలో విపక్షాలు నన్ను నిందిస్తున్నాయి.
నక్సలిజాన్ని అంతం చేసినందుకు నన్ను దూషిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు నన్ను నిందిస్తారా?
మా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగింది.
-
Feb 05, 2026 18:13 IST
నీటి విలువ తెలిసేలా ఇంకుడుగుంతలు కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు
10 లక్షల ఇంకుడుగుంతలు, మైక్రో ఇరిగేషన్తో నీటి సద్వినియోగం.
అనంతపురం జిల్లాను పండ్లతోటల వనంగా మార్చాం.
హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఏపీలో 40 నదుల నీరు వాడుకుంటే కరవు అనేదే ఉండదు.
-
Feb 05, 2026 18:12 IST
వెలిగొండ పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగు, తాగు నీరు ఇస్తాం: చంద్రబాబు
2014-19 మధ్య సాగునీటి రంగంలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాం.
రాయలసీమ లిఫ్ట్తో చాలా ప్రయోజనాలున్నాయని మభ్యపెడుతున్నారు.
ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత సాగునీటి సంఘాలది.
కాల్వల మరమ్మతులు సహా పనులన్నీ సాగునీటి సంఘాలకే ఇస్తాం.
-
Feb 05, 2026 18:11 IST
ఏపీలో నీటిని సమర్థవంతంగా వినియోగిస్తాం: సీఎం చంద్రబాబు
నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలిస్తాం.
ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం.
ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల వద్ద నీళ్లు తీసుకోవచ్చు.
చింతలపూడి లిఫ్ట్, వంశధార-నాగావళి సహా అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తాం.
-
Feb 05, 2026 18:08 IST
మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు: జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ
ప్రాథమికంగా నిర్థారించిన జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ.
పోలీసుల నుంచి లిఖిత పూర్వక నివేదిక వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్కు అందజేయనున్న విచారణ కమిటీ.
-
Feb 05, 2026 18:03 IST
కాంగ్రెస్ను భారతీయ యువత ఎప్పటికీ క్షమించదు: ప్రధాని మోదీ
ప్రణాళిక సంఘాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.
కాంగ్రెస్ ప్రధానులకు ముందు చూపు లేనందునే భారత్ అభివృద్ధి కుంటుపడింది.
-
Feb 05, 2026 17:54 IST
పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు ఎంతో మేలు: ప్రధాని మోదీ
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
ముద్ర యోజనతో రూ.30 లక్షల కోట్ల రుణాలు పంపిణీ.
రైతులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.
రైతుల సమస్యలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు.
ప్రపంచ సంక్షోభాలకు భారత్ పరిష్కారం చూపింది.
-
Feb 05, 2026 17:53 IST
యూపీఏ హయాంలో దోచుకోవడానికే అంతా పనిచేశారు: ప్రధాని మోదీ
బ్యాంకింగ్ వ్యవస్థను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది.
మా పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ లాభాల్లో ఉంది.
బ్యాంకింగ్ రంగంలో NPAలను తగ్గించాం.
-
Feb 05, 2026 17:35 IST
విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం
రాహుల్ గాంధీ తాను చక్రవర్తి అనుకుంటున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్ష నేతలకు అవగాహన లేదు.
బెంగాల్లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారు.
బెంగాల్ ప్రజల హక్కులను మమత కాలరాశారు.
ఢిల్లీలో ఆప్ నేతలు లిక్కర్ స్కాం చేశారు.
అమెరికాతో మేము ట్రేడ్ డీల్ చేసుకుంటే.. బోఫోర్స్తో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది.
-
Feb 05, 2026 17:29 IST
ఓం బిర్లా వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ
మాపై స్పీకర్ నిరాధార ఆరోపణలు: ప్రియాంక గాంధీ
నిరసన తెలిపితే దాడి అంటున్నారు: ప్రియాంక గాంధీ
-
Feb 05, 2026 17:29 IST
భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై ప్రపంచం హర్షం వ్యక్తంచేస్తోంది: మోదీ
అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత భారత్ బలం మరింత పెరిగింది: మోదీ
అమెరికాతో ఒప్పందం ద్వారా యువతకు ఎక్కువ లబ్ధి: మోదీ
మన యువతకు ప్రపంచ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి: మోదీ
-
Feb 05, 2026 17:25 IST
వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నాం: ప్రధాని మోదీ
రిఫార్మ్.. పెర్ఫార్మ్.. ట్రాన్స్ఫార్మ్ దిశగా భారత్: ప్రధాని మోదీ
ఉత్పత్తి రంగంలో అనేక విజయాలు సాధించాం: ప్రధాని మోదీ
ఎక్స్ప్రెస్ వేగంతో సంస్కరణలు అమలు: ప్రధాని మోదీ
అన్ని రంగాల్లో పోటీ పడేందుకు భారత్ సిద్ధంగా ఉంది: మోదీ
మన MSMEలు ప్రపంచ దేశాల విశ్వాసం పొందుతున్నాయి: మోదీ
-
Feb 05, 2026 17:25 IST
UPA హయాంలో 11వ ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని మోదీ
NDA హయాంలో త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని మోదీ
ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది: ప్రధాని మోదీ
EU సహా 27 దేశాలతో భారత్ అనేక ఒప్పందాలు: ప్రధాని మోదీ
9 దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకున్నాం: ప్రధాని మోదీ
-
Feb 05, 2026 17:19 IST
విపక్షాల వాకౌట్
కాసేపు ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు.
అనంతరం రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్.
-
Feb 05, 2026 17:18 IST
దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది: ప్రధాని మోదీ
అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది: ప్రధాని మోదీ
సరైన మార్గంలో పురోగమనం దిశగా భారత్: ప్రధాని మోదీ
దేశంలో ప్రతిభావంతమైన యువతకు కొరత లేదు: మోదీ
రానున్న 25 ఏళ్లు భారత్కు అత్యంక కీలకం: ప్రధాని మోదీ
దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు: మోదీ
-
Feb 05, 2026 17:17 IST
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న మోదీ
మోదీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ విపక్షాల నినాదాలు
విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోదీ ప్రసంగం
-
Feb 05, 2026 16:44 IST
నెల్లూరు: అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధురాలిని సురక్షితంగా గుర్తించిన పోలీసులు.
వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో గడ్డి ఊడలు సేకరించటానికి వచ్చిన కొందరు కడప జిల్లా వేమలూరు గ్రామస్తులు.
అడవిలో దారి తప్పి కనిపించకుండా పోయిన మామిడి నాగమ్మ (65).
112కు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
గత రాత్రి 9:30 గంటలకు వృద్ధురాలిని కనుగొన్న పోలీసులు, కుటుంబ సభ్యులకు అప్పగింత.
పోలీసుల వేగవంతమైన చర్యకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.
-
Feb 05, 2026 16:40 IST
కాంగ్రెస్ను చూసి BRSకు కడపు మండుతోంది: తుమ్మల
రూ.9 వేలకోట్ల రైతు భరోసా ఇస్తున్నాం: మంత్రి తుమ్మల
రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల
-
Feb 05, 2026 16:28 IST
కరీంనగర్: చొప్పదండి మండలం గుమ్లాపూర్లో సీఎం రేవంత్.
పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపనలు.
రామడుగులో రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన.
గంగాధర మండలం మధురానగర్లో రూ.5 కోట్లతోప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన.
-
Feb 05, 2026 16:20 IST
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
ఈనెల 11కి విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.
-
Feb 05, 2026 15:59 IST
ట్రేడ్ డీల్పై త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం.
మరో 4-5 రోజుల్లో సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.
డీల్కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించనున్న భారత్-యూఎస్ ప్రతినిధులు.
-
Feb 05, 2026 15:55 IST
ఢిల్లీ: సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్న ప్రధాని మోదీ.
అమెరికా ట్రేడ్ డీల్ పై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం.
-
Feb 05, 2026 15:51 IST
సిట్పై నమ్మకం లేకే సుప్రీంను ఆశ్రయించాం: వైవీ సుబ్బారెడ్డి
లడ్డూలో జంతుకొవ్వు లేదని సీబీఐ తేల్చింది.
జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి.
కూటమి నేతలు మళ్లీ విషప్రచారం చేస్తున్నారు.
-
Feb 05, 2026 15:49 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
504 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.
133 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.
-
Feb 05, 2026 15:45 IST
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు
ప్రధానిపై దాడిచేసేలా విపక్ష సభ్యులు వ్యవహరించారు: ఓం బిర్లా
అందుకే ప్రధాని మోదీని సభలోకి రావొద్దని చెప్పా: ఓం బిర్లా
పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు: ఓం బిర్లా
విపక్ష సభ్యులు సభా మర్యాదను మంటగలిపారు: ఓం బిర్లా
-
Feb 05, 2026 15:44 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
504 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.
133 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.
-
Feb 05, 2026 15:15 IST
పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించిన పాక్.
పాక్ నిర్ణయంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్.
ఇండియా, పాక్ మ్యాచ్ జరగకపోతే క్రికెట్ ప్రపంచం నష్టాల్లో కూరుకుపోతుంది: బీసీబీ డైరెక్టర్
పాక్ వైఖరి ఇతర బోర్డులకు నష్టం తెచ్చిపెట్టేలా ఉంది: బీసీబీ డైరెక్టర్
-
Feb 05, 2026 15:11 IST
అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
తన యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
-
Feb 05, 2026 15:11 IST
లోక్సభ రేపటికి వాయిదా
భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై విపక్షాల ఆందోళన.
ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్.
విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ వాయిదా.
-
Feb 05, 2026 15:06 IST
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ సర్కార్ నిధులు ఇవ్వలేదు: బండి సంజయ్
కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదు.
BRS నేతలు కబ్జాలు చేసి రూ.వేల కోట్లు సంపాదించారు.
-
Feb 05, 2026 15:02 IST
నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదు: పవన్
తప్పు చేసి క్షమాపణ అడగకుండా తిరిగి మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు: పవన్
శ్రీవారి దగ్గర తప్పు చేసిన వారు నాశనమైపోతారు: పవన్
సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్చిట్ ఇవ్వలేదు: పవన్
రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్
-
Feb 05, 2026 15:02 IST
ఏపీ నకిలీ మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈనెల 19 వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ కోర్టు.
-
Feb 05, 2026 14:43 IST
హైదరాబాద్: ముషీరాబాద్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో అగ్నిప్రమాదం
హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.
సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ ఉమెన్ హాస్టల్లో అగ్నిప్రమాదం.
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది.
షార్ట్సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల అనుమానం.
-
Feb 05, 2026 14:42 IST
కూటమి నేతలు ఎక్కడైనా బూతులు మాట్లాడారా?: సీఎం చంద్రబాబు
ఇప్పటికీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు.
వివేకాను హత్య చేసి.. కత్తి నా చేతిలో పెట్టారు.
-
Feb 05, 2026 14:40 IST
తిరుమల పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారు: సీఎం చంద్రబాబు
రసాయనాలు కలిపారని సీబీఐ చార్జ్షీట్లో ఉంది.
ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పరా?
ప్రతి ఒక్కరూ ఈ మహాపాపంపై చర్చించాలి.
పరకామణి కేసులో సెటిల్మెంట్ చేసి సమర్థిస్తారా?
దొంగతనం చేసిన వారిని సమర్థిస్తారా?
ఇది వేంకటేశ్వరస్వామిపై దాడే.
మహా పాపం చేశారు.. క్షమాపణలు చెప్పాలి.
తప్పు చేసినవారికి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో మీరే చూస్తారు.
దోషులకు కచ్చితంగా శిక్ష తప్పదు.
దేవుడి పవిత్రతను కాపాడలేనంత అసమర్థులం కాదు.
-
Feb 05, 2026 14:08 IST
జగన్ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
దుర్మార్గాలు చేసి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు : సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు భక్తులు తిరుమలకు రావాలంటే అనుమానించే పరిస్థితి వచ్చింది: సీఎం చంద్రబాబు
ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతాం: చంద్రబాబు
వైసీపీ.. నాతోనే కాదు, దేవుడితో కూడా పెట్టుకున్నారు : సీఎం చంద్రబాబు
శ్రీవారిపై జగన్కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
-
Feb 05, 2026 14:00 IST
స్వామివారి నిధుల దుర్వినియోగంపై జవాబు చెప్పాలి: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది.
స్వామివారి నిధులు దుర్వినియోగంపై నాటి ప్రభుత్వం జవాబు చెప్పాలి.
అన్యమతస్థుల సంఖ్య పెంచి ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూశారు.
భక్తులు మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాలి.
-
Feb 05, 2026 13:29 IST
మున్సిపల్ ఎన్నికలకు కో-ఆర్డినేటర్ల నియామకం..
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కో-ఆర్డినేటర్ల నియామకం..
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కో-ఆర్డినేటర్ల నియామకం..
ప్రచారం, నేతల మధ్య సమన్వయం చేయనున్న కో-ఆర్డినేటర్స్..
-
Feb 05, 2026 13:17 IST
విజయవాడకు చేరుకున్న మంత్రి నారాయణ..
విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న మంత్రి నారాయణ బృందం..
రెండురోజుల పాటు లండన్, ఒకరోజు దోహాలో పర్యటించిన బృందం..
పర్యాటక ప్రాజెక్టులు, స్పోర్ట్స్ సిటీపై అధ్యయనానికి వెళ్లిన మంత్రి నారాయణ..
-
Feb 05, 2026 12:54 IST
రీల్స్ కోసం బైక్ స్టంట్.. వ్యక్తి మృతి..
కడప నగర శివారులో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు..
వేగంగా వెళ్లే బైక్పై విన్యాసాలు చేస్తుండగా అదుపు తప్పిన బైక్..
ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు..
-
Feb 05, 2026 12:30 IST
కూకట్పల్లి జోనల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..
మేడ్చల్: కూకట్పల్లి జోనల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..
రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SE చిన్నారెడ్డి..
రూ.1.40 కోట్ల పెండింగ్ బిల్లుల మంజూరుకు రూ.30 లక్షల డిమాండ్..
చిన్నారెడ్డికి 14రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి ఏసీబీ కోర్టు..
-
Feb 05, 2026 12:05 IST
గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..
5వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన కేంద్రం..
తొలి విడతగా రూ.259.36 కోట్ల విడుదల..
కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. ఎన్నికల జాప్యంతో నిలిచిపోయిన నిధులు..
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదల.
-
Feb 05, 2026 11:39 IST
రాజ్యసభలో కొనసాగుతున్న మాటల యుద్ధం
సభలో నన్ను మాట్లాడనివ్వడం లేదు..
పార్లమెంట్లో విపక్ష సభ్యులను గొంతెత్తనివ్వడం లేదు: మల్లికార్జున్ ఖర్గే
-
Feb 05, 2026 11:36 IST
నైజీరియాలో సాయుధ మూక నరమేధం..
కార్వా రాష్ట్రంలోని వోరో, నూక గ్రామాల్లో దాడులు..
200 మంది ప్రజలను చంపిన ఉగ్రమూకలు..
ఇటీవల ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా.. సైనిక ఆపరేషన్లు చేపట్టిన ప్రభుత్వం..
-
Feb 05, 2026 11:11 IST
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది: సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన సీబీఐ
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన సీబీఐ
ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామన్న సీబీఐ..
ఇంకా ఎవరినైనా విచారించాలనుకుంటే అనుమతి పొందవచ్చన్న ధర్మాసనం..
సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా హాజరై వాదిస్తారని.. అంతవరకూ పాస్ ఓవర్ చేయమని అడిగిన సునీత తరపు న్యాయవాది..
విచారణ మరికొద్దిసేపటికి వాయిదా..
-
Feb 05, 2026 11:06 IST
లోక్ సభ వాయిదా
ఢిల్లీ: లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా..
విపక్షాల ఆందోళన నడుమ సభను వాయిదా వేసిన స్పీకర్..
-
Feb 05, 2026 10:44 IST
గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు బెంచ్ తీర్పు..
సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన సీజే ధర్మాసనం..
గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు..
మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి..
సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీ పీఎస్సీ, ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పు..
తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సీజే బెంచ్..
ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం..
-
Feb 05, 2026 10:12 IST
ఔషధ విక్రయ డొమైన్లను సీజ్ చేసిన అమెరికా
భారత్ కేంద్రంగా పనిచేస్తున్న 200 ఔషధ విక్రయ డొమైన్ల సీజ్ చేసిన అమెరికా డీఈఏ..
అక్రమంగా ఆన్లైన్ ఫార్మా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన అమెరికా డీఈఏ..
2022 నుంచి అమెరికాలోని రాకీ మౌంటేన్ ఫీల్డ్ డీఈఏ ఆర్గనైజేషన్ దర్యాప్తు..
-
Feb 05, 2026 10:05 IST
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి
ఛత్తీస్గఢ్: పెద్దగెల్లూరు అటవీప్రాంతంలో ఎన్కౌంటర్..
మావోయిస్టు కీలక నేత ధరమ్సింగ్ మృతి..
ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాల స్వాధీనం..
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..
-
Feb 05, 2026 10:03 IST
పాలక్కాడ్లో పేలుడు పదార్ధాల స్వాధీనం..
కేరళ: పాలక్కాడ్లో 100 బాక్స్ల్లో పేలుడు పదార్ధాల గుర్తింపు..
20 బాక్సుల్లో డిటోనేటర్లు, 80 బాక్సుల్లో జిలెటెన్ స్టిక్స్ స్వాధీనం..
పుచ్చకాయల లోడ్ కింద దాచి పేలుడు పదార్థాల అక్రమ రవాణా..
-
Feb 05, 2026 10:01 IST
పంచాయతీ కార్యదర్శుల పాస్వర్డ్ల చోరీ..
మహబూబాబాద్: బయ్యారం మండలంలో పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ పాస్వర్డ్ల చోరీ..
290 జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు..
MPDO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
-
Feb 05, 2026 09:47 IST
మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: BRS మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై కేసు నమోదు..
సీపీ సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యల చేశారంటూ..
బంజారాహిల్స్ పీఎస్లో జీవన్రెడ్డిపై కేసు నమోదు..
పోలీస్ అధికరుల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు..
-
Feb 05, 2026 09:35 IST
అల్-ఫలా వర్సటీ ఛైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్
హరియాణా: అల్-ఫలా వర్సటీ ఛైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్..
UGC ఫిర్యాదుతో జావెద్ అహ్మద్ సిద్ధిఖీపై కేసు నమోదు..
అల్-ఫలా వర్సిటీ కేంద్రంగా ఢిల్లీ పేలుళ్లకు కుట్ర కేసులో అరెస్ట్..
-
Feb 05, 2026 09:33 IST
భారత్తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్
టీ-20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడబోయేది లేదు..
క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
-
Feb 05, 2026 09:05 IST
గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు..
అమెరికా వర్క్ వీసా నిబంధనలు కఠినతరం నేపథ్యంలో..
భారత్లో మరో పెద్ద కార్యాలయం ఏర్పాటు చేసే యోచన..
గూగుల్ క్యాంపస్తో మరో 20 వేల మందికి ఉద్యోగావకాశాలు..
-
Feb 05, 2026 08:52 IST
విశాఖలో బాంబు కలకలం..
విశాఖ తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం..
స్క్రాప్ దుకాణం దగ్గర అనుమానాస్పదంగా 3 బ్యాగులు..
తనిఖీలు నిర్వహించి ఏమీ లేదని తేల్చిన పోలీసులు..
-
Feb 05, 2026 08:51 IST
నేడు మేడారానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు..
ములుగు: మేడారంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటాగా తీసుకున్న కమిషన్..
డెలినా ఖోంగ్డస్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు..
నేడు మేడారం రానున్న కమిటీ సభ్యులు..
-
Feb 05, 2026 07:55 IST
నేడు గ్రూప్-1పై హైకోర్టు తుది తీర్పు..
హైదరాబాద్: నేడు గ్రూప్-1పై హైకోర్టు తుది తీర్పు..
గతంలో మెరిట్ లిస్ట్ రద్దు చేసిన సింగిల్ బెంచ్..
TGPSC అప్పీల్ పిటిషన్పై నేడు డివిజన్ బెంచ్ తీర్పు..
-
Feb 05, 2026 07:30 IST
జోగి రమేష్ బెయిల్ రద్దుపై నేడు విచారణ
జోగి రమేష్ బెయిల్ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ..
మద్యం కేసులో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలన్న..
పోలీసుల పిటిషన్పై విచారించనున్న హైకోర్టు..
-
Feb 05, 2026 07:29 IST
నేడు సాగునీటి సంఘాల అధ్యక్షుల భేటీ..
అమరావతి: నేడు సాగునీటి సంఘాల అధ్యక్షుల భేటీ..
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం..
హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
సాగునీటి సంఘాలకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.
-
Feb 05, 2026 06:54 IST
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు
నేటి నుంచి మేడారం మహా జాతర హుండీల లెక్కింపు..
రికార్డు స్థాయిలో ఈ సారి 828 హుండీల ఏర్పాటు..
-
Feb 05, 2026 06:53 IST
నేటి నుంచి అమిత్ షా పర్యటన..
జమ్మూకశ్మీర్లో నేటి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..
3 రోజులు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్న అమిత్ షా..
జమ్మూకశ్మీర్లో భద్రతపై అమిత్ షా సమీక్ష..
-
Feb 05, 2026 06:23 IST
సైబర్ నేరాల నియంత్రణకు నేడు షీల్డ్- 2026 కాంక్లేవ్
నేడు హైదరాబాద్లో సైబర్ నేరాల నియంత్రణకు షీల్డ్-2026 కాంక్లేవ్..
కమాండ్ కంట్రోల్ సెంటర్లో సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి..
సదస్సులో పాల్గొననున్న 14 రాష్ట్రాల సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు.
-
Feb 05, 2026 06:21 IST
నేడు చొప్పదండిలో సీఎం రేవంత్రెడ్డి ప్రచారం
నేడు చొప్పదండిలో సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లిలో పొంగులేటి రోడ్షో..
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి ప్రచారం..
-
Feb 05, 2026 06:19 IST
నైజీరియాలో రెచ్చిపోయిన సాయుధ మూకలు
నైజీరియాలో మరోసారి రెచ్చిపోయిన సాయుధ మూకలు..
సాయుధ మూకల దాడుల్లో 162 మంది మృతి.
-
Feb 05, 2026 06:17 IST
నేడు భీమవరంలో జగన్ పర్యటన..
నేడు ప.గో.జిల్లా భీమవరంలో జగన్ పర్యటన..
పెదఅమిరంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.
-
Feb 05, 2026 06:16 IST
రేపు ప్రధాని.. 'పరీక్షాపే' చర్చ..
రేపు ప్రధాని నరేంద్ర మోదీ.. 'పరీక్షాపే' చర్చ..
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాపం నింపేలా ప్రధాని ప్రసంగం.
-
Feb 05, 2026 06:14 IST
నేడు టీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల
నేడు టీజీఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల..
ఫిబ్రవరి 9నుంచి మే 15వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ..
-
Feb 05, 2026 06:11 IST
నేడు కూటమి పార్టీ అధినేతల సమావేశం
అమరావతి: నేడు కూటమి పార్టీ అధినేతల సమావేశం..
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ..
తిరుమల లడ్డూలో రసాయనాల అంశంపై కీలక సమావేశం..
లడ్డూ వ్యవహారాన్ని ప్రజలకు వివరించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ చీఫ్..
కూటమి పార్టీల అధినేతలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం..