మహబూబాబాద్లో షాక్.. పంచాయతీ కార్యదర్శుల పాస్వర్డ్ల చోరీ
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:16 AM
మహబూబాబాద్లో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్వర్డ్లు చోరీకి గురయ్యాయి.
మహబూబాబాద్లో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్వర్డ్లు చోరీకి గురయ్యాయి (Panchayat secretaries password theft). నామలపాడు, ఇర్సులాపురం, కొత్తగూడెం, బాల్యాతండా గ్రామపంచాయతీ కార్యదర్శుల డిజిటల్ పాస్వర్డ్లను గుర్తు తెలియని వ్యక్తులు చేజిక్కించుకున్నారు. వాటి సహాయంతో 290 మంది జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..