Share News

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:34 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
LPG Crisis

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం (LPG Crisis) ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇండేన్( INDANE) గ్యాస్ ఐవీఆర్ఎస్(IVRS), వాట్సాప్ (WhatsApp)లు బుకింగ్ పని చేయడం లేదు. అప్పుడప్పుడు భారత్, HP గ్యాస్ ఐవీఆర్ఎస్(IVRS), వాట్సాప్ (WhatsApp) బుకింగ్‌లు పని చేయట్లేదు.


దీనితో గ్యాస్ డీలర్లు వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాక్ లాగ్ తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ఇలా చేస్తున్నాయని వినియోగదారులు తెలిపారు. వినియోగదారుల మొబైల్‌కు ఓటీపీ (OTP) వస్తేనే డెలివరీ ఇవ్వాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌లపై ఆయా కంపెనీలు ఆంక్షలు విధించాయి. గ్యాస్ దుర్వినియోగం గాకుండా వినియోగదారుల మొబైల్ నుంచి ఓటీపీ (OTP) తీసుకుంటున్నామని ఆయిల్ కంపెనీల అధికారులు చెబుతున్నారు.


రోజు వారి బుకింగ్‌ల కంటే నిన్న(బుధవారం) ఒక్కరోజే మూడు రెట్లు అధికంగా బుకింగ్‌లు జరిగాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. గృహ అవసరాలకు ఎలాంటి గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్యానిక్ బుకింగ్‌తోనే ఈ సమస్య వస్తోందని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే కమర్షియల్ సిలెండర్‌ల సరఫరాను సగానికి పైగా ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. హాస్టల్స్, ఆస్పత్రుల వంటి అత్యవసర సర్వీసులకే ఇవ్వాలని ఆయిల్ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 03:25 PM