Home » Lpg Price
పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.
గ్యాస్ వినియోగదారులను ఈ-కేవైసీ పరేషాన్ చేస్తోంది. ఏజెన్సీల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నప్పటికీ కనెక్షన్తో ఆధార్ సీడింగ్ కాకపోవడంతోపాటు కస్టమర్ల ఐరిష్ త్వరగా క్యాచ్ కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.200కు పైగా తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ ఇతరత్రా వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
పారిశ్రామిక, వాణిజ్య ఎల్పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనాన్ని కలిగించే శుభవార్త చెప్పింది. దేశీయేతర ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై ఉన్న అన్ని రకాల రంగాలవారీ పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది.
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా ఈ నెలాఖరులోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది.
భారత్లో గృహవినియోగ గ్యాస్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం (జూన్ 1) నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్ విభాగం గ్యాస్ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.