Home » Gas price Hike
తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్ విభాగం గ్యాస్ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.
పశ్చిమాసియా పరిణామాలతో ఎల్పీజీ కొరత, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఆహార పరిశ్రమపై పడిన ప్రభావం ఇది. వీధుల్లోని చిన్నపాటి ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల దాకా ఆగమాగం అవుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు గృహ విని యోగదారులకు అందించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎదురైన ఇబ్బందులు కాస్తా తీరాయనుకుంటే వాణిజ్య గ్యాస్ వినియోగదారులపై (కమర్షియల్ గ్యాస్) పెనుభారం పడిం ది.
కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి
బెంగళూరు నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డు పెట్టారు.
వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు పెంచాయి.
ఆటోలలో సీఎన్జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.
అమెరికా - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.