Share News

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు

ABN , Publish Date - May 18 , 2026 | 02:38 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (Narendra Modi) స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.


ఈ గౌరవం భారత్‌కి గర్వకారణం..

ప్రధాని మోదీకి లభించిన ఈ గౌరవం భారతదేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠను మరింత పెంచడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రభావాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వీడన్ ప్రభుత్వం అందించిన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ పురస్కారం ప్రధాని మోదీకి లభించిన 31వ అంతర్జాతీయ గౌరవమని ప్రస్తావించారు. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా భారతదేశానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా సీఎం అభివర్ణించారు.


భారత్‌ను గ్లోబల్ శక్తిగా మోదీ నిలబెడుతున్నారు..

ప్రపంచ దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సహకారం, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ శక్తిగా నిలబెట్టే దిశగా ప్రధాని తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో, ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 03:12 PM