ఈనెల 31న కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సమావేశం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:55 AM
కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీ, జులై 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఎన్డీఎస్ఏ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
మూడు బ్యారేజ్లను టెస్టింగ్ చేస్తున్నాం..
కాళేశ్వరంపై అంతర్జాతీయ నిపుణులతో, ఎన్డీఎస్ఏ అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మూడు బ్యారేజ్లను టెస్టింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో రిహబిలిటేషన్ డిజైన్స్ వర్క్ పూర్తి చేస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపడతామని తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
నాసిరకం డిజైన్తోనే కాళేశ్వరం కూలింది..
కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా కడితే ఈ సమస్య వచ్చేది కాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం కూలిపోవడానికి ప్రధాన కారణం నాసిరకం డిజైన్, నాసిరకం నిర్మాణమేనని వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తమకు ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలనే విషయాన్ని ఎన్డీఎస్ఏ అధికారులు స్పష్టం చేశారని అన్నారు. కాపర్ డ్యాం కట్టాలా, వద్దా అని ఎన్డీఎస్ఏ అధికారుల సలహా ప్రకారమే నడుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి
ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్బస్సు వచ్చేస్తోంది!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News