Home » Kalvakuntla Chandrasekhar Rao
భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి నేడు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు.. పీవీకి ఘన నివాళులు అర్పించారు.
ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని ధారపోశారని, ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందామని పేర్కొన్నారు.
ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్పై సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..
కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. ఈ కథనంలో చూద్దాం.
బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్, క్రమశిక్షణపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు.