Home » Kalvakuntla Chandrasekhar Rao
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నేతలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించాయని వారు తెలిపారు. ఒకవైపు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఒక కీలక కేసులో భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2011లో జరిగిన 'మిలీనియం మార్చ్' సందర్భంగా నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.
కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
భారత రాష్ట్ర సమితి మరో ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.