Home » Medigadda Barrage
హైడ్రాపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలని ఎన్డీఎస్ఏ అధికారులు గుర్తించారని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ను క్యాటగిరి-1 ప్రమాదకర డ్యామ్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే దేశంలోని డ్యామ్ల భద్రతపై పార్లమెంటులో కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన పగుళ్లు, మార్పులపై ఐదు రకాల నివేదికలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ)కు తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం నీటి ప్రవాహ తీవ్రతను అంచనా వేసే ఏడీసీపీ(అకోస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వే నిర్వహించారు.