ఫార్ములా-ఈ రేస్ కేసు.. 25వ తేదీకి విచారణ వాయిదా
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:08 AM
ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.
హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో ఈరోజు(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇప్పటికే ACB చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కార్ రేస్తో HMDAకు రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని చార్జ్షీట్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, FEO కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఛార్జ్షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కేటీఆర్ లక్ష పూచీకత్తు , 2 షూరిటీస్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
వార్తలు కూడా చదవండి...
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News