Home » Nampalli
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
తెలుగు ఇండస్ట్రీకి పైరసీ ద్వారా నష్టం తీసుకువస్తున్నాడని బోడపాటి రవికుమార్ అలియాస్ ఐబొమ్మ రవి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.
నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.