Home » Nampalli
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.
చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుండగా, ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
కన్నపేగుకు ఎంత కష్టమొచ్చిందో..! పెంచాల్సిన తండ్రికి ఎంత బరువైందో..! ఆడబిడ్డగా పుట్టినందుకు కుటుంబానికే ఈసడింపు వచ్చిందో..! తెలియదు కానీ.. పసిగుడ్డు అనే కనికరం కూడా చూపకుండా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.
నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
హైదరాబాద్లోని నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(శనివారం) హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
బచ్చాస్ ఫర్నిచర్ షాపు కేసుకు సంబంధించి షాపు యజమాని సతీష్ బచాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సతీష్.. సెల్లార్లో ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు.