Home » Nampalli
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.
నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి దిగ్భ్రాంతికర విషయం ఉందా అని ఆ కుర్రాడు షాక్ అయ్యే పరిస్థితి..
రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న పలు ఆస్తులను వేలం వేసే దిశగా దృష్టి సారించింది. ఇప్పటికే పలుచోట్ల ఉన్న ఆస్తులను వేలం వేస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆస్తులనూ వేలం వేయాలని నిర్ణయించింది.
9వ తేదీ సాయంత్రం వరకు నగరంలోని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.