Share News

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Jun 17 , 2026 | 06:57 PM

రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు.

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు. పేదలు సన్నబియ్యం తినాలని.. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సచివాలయంలో భట్టివిక్రమార్క అధ్యక్షతన ఈరోజు (బుధవారం) కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, నిల్వ సదుపాయాలపై ఈ సమీక్షలో చర్చించామని తెలిపారు.


ఆ పంటలకు ప్రాధాన్యం ఇస్తాం..

నాణ్యమైన వరి రకాల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. BPT 5204, తెలంగాణ సోనామసూరి, KNM-1638, జై శ్రీరామ్, HMT రకాలపై ఫోకస్ పెట్టామని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలతో తెలంగాణ రైతాంగం నష్టపోతోందని భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామగ్రామాన రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతు కమిషన్ తెలిపింది. మేలుజాతి వంగడాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ కమిషన్ సూచించింది. రాబోయే సీజన్లలో నాణ్యమైన వరి రకాల సాగు విస్తరణ లక్ష్యమని పేర్కొంది. ఎఫ్‌సీఐ కొనుగోళ్లు తగ్గించడంతో రైతులకు ఇబ్బందిగా మారిందని వ్యవసాయ కమిషన్ అభిప్రాయపడింది.


ఈ వార్తలు కూడా చదవండి...

బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 07:02 PM