Home » Uttam Kumar Reddy Nalamada- Congress
బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ముంబై పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు.
సాగునీటి అంశంపై హరీశ్ రావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుందిల్లా లింక్ ద్వారా కొత్త అలైన్మెంట్తో 10 నుంచి 12 శాతం వ్యయం తగ్గే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.