Home » Agriculture
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు ఎన్నడూ లేనంత ధరలు పలికాయి.
ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్పామ్ పంట తెరపైకి వచ్చింది.
సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది.
పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు బులియన్ మార్కెట్ను తలపిస్తోంది. ఆదివారం స్వల్పంగా పెరిగి రూ.220కి చేరింది.
రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.