పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:03 AM
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ పర్యటనపై లోకేశ్
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఒక మనిషి ప్రాణాలు బలితీసుకున్న ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం. బాధితుడిని వదిలేసి నిందితుడికి అండగా నిలిచే రాజకీయ నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బహుశా జగన్ రెడ్డి మాత్రమే. ఇది పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ఠ’ అని లోకేశ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News