Home » Seediri Appala Raju
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు.
వైసీపీ అధినేత జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమాయకుడి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షాధారాలను తారుమారు చేయడం, అసలైన నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, తన అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరదీసిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయ్యింది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన బోట్లను మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమిషనర్ మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు.
తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.
అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్లను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు.
ఆయనో మంత్రి. బాధ్యతగా ఉండాల్సిన అమాత్యుడే ప్రత్యర్థుల ఓట్లపై కుస్సు బుస్సులాడారు. ఏకంగా తెలుగుదేశానికి వేసే ఓట్లను తొలగించేలా కృషి చేయాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఆ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.