Share News

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

ABN , First Publish Date - 2023-10-19T12:59:06+05:30 IST

తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు గుప్పించారు.

Kuna Ravikumar: అలా మాట్లాడినందుకు మంత్రి అప్పలరాజు సిగ్గుపడాలి

శ్రీకాకుళం: తండ్రి పేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ (CM Jagan) ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ (TDP Leader Kuna Ravikumar) ఆరోపణలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్ల అహంకారానికి ఉత్తరాంధ్ర అనగతోక్కబడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అని మంత్రి సిదిరి అప్పలరాజు (Seediri Appalaraju) మాట్లాడినందుకు సిగ్గుపడాలన్నారు. వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఏం చేశావో మంత్రి అప్పలరాజు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు బొత్స (Minister Botsa Satyanarayana), ధర్మాన ప్రసాద్ (Dharmana Prasad) డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీని కోళ్లఫారం పార్టీ అని ధర్మాన విమర్శించారని. రాజశేఖర్ రెడ్డిని (Rajashekar Reddy) చంపించింది జగన్, విజయమ్మ అని బొత్స అనలేదా అంటూ గుర్తుచేశారు. చంద్రబాబును (Chandrababu Naidu) విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదన్నారు. పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. మంత్రి అప్పలరాజు తన జాతిని రెడ్లకు తాకట్టుపెట్టి నిర్వీర్యం చేస్తున్నారని.. మంత్రి అప్పలరాజు అజ్ఞాని అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బీసీల పార్టీ అని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామని కూన రవికుమార్ హెచ్చరించారు.

Updated Date - 2023-10-19T12:59:06+05:30 IST