AP News; మంత్రి అప్పలరాజుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు..

ABN , First Publish Date - 2023-08-07T15:42:08+05:30 IST

అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్లను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు.

AP News; మంత్రి అప్పలరాజుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు..

అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్ల (Votes)ను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు (Minister Sidiri Appalaraju) చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఫామ్-7 ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20.50 లక్షల ఓట్లను తొలగించారని, ఏ కారణంతో ఓట్లు తొలగించారో వివరిస్తూ జాబితా ఇవ్వాలని కోరారు. మంత్రి అప్పల రాజుపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సత్వరమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-07T15:42:08+05:30 IST