నేడు శ్రీకాకుళం జైలుకు జగన్.. అప్పలరాజుకు పరామర్శ
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:41 AM
వైసీపీ అధినేత జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు.
శ్రీకాకుళం, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటనకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్షోలు నిర్వహించడానికి వీల్లేదని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.