Home » Minister Nara Lokesh
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
స్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నిది కేంద్రమంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని.. లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని చెప్పుకొచ్చారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కరిస్తున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్పై శ్రద్ధపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. బాబా చూపిన బాటలో అందరం నడుద్దామని పిలుపునిచ్చారు.
అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.