Share News

Ramchandra Rao on Local Elections: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం:రాంచందర్ రావు

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:48 PM

రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.

Ramchandra Rao on Local Elections: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం:రాంచందర్ రావు
Ramchandra Rao on Local Body Elections

హైదరాబాద్, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను (Local body Election) ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana Election Commission). మొదట ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడారు.


ఆలస్యమైనా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రపతి , గవర్నర్‌ల పేరిట కాలయాపన చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.


తమ గెలుపునకు స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం కాబోతున్నాయని ఉద్ఘాటించారు. తమకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తుచేశారు. తాను స్వయంగా ఇప్పటివరకు 23 జిల్లాల్లో యాత్రలు చేశానని తెలిపారు. ఇంకో నాలుగు జిల్లాల్లో యాత్ర చేయాల్సి ఉందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను తామే గెలువబోతున్నామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2025 | 12:50 PM