Home » Elections
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేశ్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 4,062 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. హేతుబద్ధీకరణలో భాగంగా 3,995కు తగ్గించారు.
నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
రాజ్యసభకు ఈనెల 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా దీనికి ముందే పోటీ లేకుండా 24 మంది పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు.
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డులు, డివిజన్ల పునర్విభజన అంశంపై కీలక సమావేశం నిర్వహించింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
కాలం కలిసి వస్తే భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ వస్త్ర వ్యాపారి, సినీ నటుడు లెజెండ్ శరవణన్ పేర్కొన్నారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.