Assembly Speaker ON Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
ABN , Publish Date - Sep 29 , 2025 | 07:46 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరుకానున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల (Disqualification Petitions)పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ప్రతివాదుల లాయర్లు. సంజయ్, చింతా ప్రభాకర్ను క్రాస్ ఎగ్జిమినేషన్ చేయనున్నారు ప్రతివాదుల లాయర్లు. ఈరోజు నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు ఉండనున్నాయి. ఈ క్రమంలో అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్లల్లో ఇవ్వని ఉద్యోగాలను ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం
గురుకుల నిత్యావసర బిల్లుల పెండింగ్ సిగ్గుచేటు
Read Latest Telangana News and National News