Home » Telangana Assembly
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపించారు స్పీకర్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతుంది.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు....
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు.
కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..
ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
గృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహ జ్యోతి వర్తిస్తుందన్నారు.