Home » Gaddam Prasad Kumar
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ తీర్పు ఇచ్చారు.
అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారించనున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. దానం నాగేందర్పై స్పీకర్ అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నామన్నారు.
వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపారు. తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపించారు స్పీకర్.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ(గురువారం) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ చేత ప్రమాణం చేయించారు.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరుకానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.