Share News

వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Aug 10 , 2026 | 06:21 AM

నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు.

వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
Varuna Yagam

నల్లగొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం (Varuna Yagam) ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరిపిస్తున్నారు. కృష్ణా – గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

UTTAM-KUMAR-REDDY-1.jpg


వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy), పద్మావతి రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ బి .చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశాన్ని రుత్వికులు చేయించారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు పూర్ణహుతిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

UTTAM-KUMAR-REDDY-2.jpg


వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 06:38 AM