వరుణ యాగాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:21 AM
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు.
నల్లగొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం (Varuna Yagam) ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరిపిస్తున్నారు. కృష్ణా – గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy), పద్మావతి రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ బి .చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశాన్ని రుత్వికులు చేయించారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు పూర్ణహుతిలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు.

వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News