Home » Nagarjuna Sagar
వరుణయాగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జునసాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు.. గత స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల తొలి పరిచయం నాగార్జునసాగర్లోనే జరిగింది.
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతిలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్లో మహా వరుణ యాగం ప్రారంభమైంది.
కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవడంతోపాటు రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర సుభిక్షం కోసం వరుణ యాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఆగస్టు 10వ తేదీ ముహూర్తం ఖరారు చేసింది.
కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.19 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని.. చెప్పారు.
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ గోదావరి ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి