వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 06:19 PM
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. ఈరోజు(ఆదివారం)హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షత వహించారు.
రాష్ట్రంలో వర్షాకాల పరిస్థితులు, వరద ముప్పు, పట్టణాలు, గ్రామాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్ అండ్ బీ, జలమండలి వంటి విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొని తమ శాఖల సిద్ధతపై వివరాలు అందించారు. ఈ సమావేశంలో వరదల నివారణ, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, అత్యవసర సేవల సమన్వయం, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, ఎప్పటికప్పుడు అప్రమత్తత అవసరమని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. అలాగే సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్ రంజన్, వికాస్రాజ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. పోలీస్ శాఖ నుంచి సజ్జనార్, రమేశ్ రెడ్డి, సుమతి వంటి పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. అలాగే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్ది కీలక పాత్ర: రాజ్నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News