Home » Rain Alert
రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.