Home » Weather
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.
జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తాయని తెలిపింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా తల, ఒళ్లు నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు కనిపిస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
గుజరాత్, మహారాష్ట్ర, అసోం, ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. జనజీవితం అస్తవ్యస్తమైంది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.