Home » Weather
ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణమే నెలకొంది. అయితే సోమవారం నాటికి ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్-నినో పరిస్థితుల కారణంగా 2026 వేసవి సీజన్లో సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి.
నగరంలోని గాంధీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఎన్నడూ లేనంతగా ఒకటేసారి భారీగా రోగులు పెరిగారు. కాగా.. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలను వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో గాంధీకి రోగులు క్యూ కడుతున్నారు.
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తున్నది. ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని పలువురు చెప్తున్నారు. సాధారణంగా ఈ నెలాఖరున జనవరి మొదట్లో కొద్ది రోజులపాటు 10 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈసాన్యా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలో కన్నా ఈ ఏడాది ఎక్కువ చలి ప్రభావం చూపిస్తుంది.
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంచు దట్టంగా కురిసింది.