Home » Weather
కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంచు దట్టంగా కురిసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. నగరంలోని శేరి లింగంపల్లిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రాంతం, ఉత్తర తెలంగాణలోని కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలోని అత్యంత శీతల ప్రాంతాలుగా నిలిచాయి
గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాయవ్య భారతం నుంచి అతిశీతల గాలులు మధ్యభారతం మీదుగా దక్షిణాది వరకూ వీస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉదయం, రాత్రిళ్లు ఎముకలు కొరికే చలి పెడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీలు.. మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఉదయం వాకింగ్ చేసే వాళ్లు సైతం చలి కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులతోపాటు కూరగాయల విక్రేతలు సైతం ఉదయం వేళ చలి తీవ్రత చూసి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎముకలు కొరికే చలితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ రోగాలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి పులి పంజా విసురుతున్నట్లుగా వాతావరణం మారింది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది....
వచ్చే మూడు రోజులు ఏపీ, తెలంగాణ, యానాం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.