Share News

సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు: జోగిని శ్యామల

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:15 AM

ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినిలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆదివారం బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు: జోగిని శ్యామల
Jogini Shyamala

హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల (Jogini Shyamala) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం వచ్చినప్పుడే జోగినిలను ప్రభుత్వం గుర్తు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. బోనాల సందర్భంగా జోగినిలకు కనీస ఏర్పాట్లు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆలయ సిబ్బంది జోగినిలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి..

పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జోగిని శ్యామల ఆగ్రహించారు. ఉదయం నుంచే గేట్ల వద్ద పోలీసులు జోగినిలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినిలను అవమానించారని దుయ్యబట్టారు. ఆలయ కమిటీ జోగినిలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కనీసం జోగినిలని అని కూడా చూడకుండా బయటకు ఎందుకు నెట్టేశారని ప్రశ్నించారు. జోగినిలకు గౌరవం, ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని జోగిని శ్యామల కోరారు.


ఆలయం ముందు జోగినిల ధర్నా..

ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినిలు ఈరోజు (సోమవారం) ధర్నా చేపట్టారు. నిన్న(ఆదివారం) బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు జోగినిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లు తొలగించుకుని మహంకాళి ఆలయంలోకి జోగినిలు ప్రవేశించారు.


ఆందోళనపై జోగినిలతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

మహంకాళి ఆలయం ముందు జోగినిల ఆందోళనతో ఆలస్యంగా రంగం కార్యక్రమం ప్రారంభమైంది. జోగినిల ఆందోళనతో అమ్మవారి ఆలయం ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. జోగినిలను చర్చలకు పిలిచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండోమెంట్ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. ఆందోళనను విరమించాలని జోగినిలను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.


వార్తలు కూడా చదవండి...

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 11:38 AM