Home » Ponnam Prabhakar
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్న ప్రభాకర్ని ప్రశంసిస్తూ నితిన్ గడ్గరీ గురువారం లేఖ రాశారు.
ఆర్టీసీ అధికారులు.. కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల విషయంలో సానుకూలంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపామని ప్రస్తావించారు.
తెలంగాణ నుంచి శిక్షణ పొంది అత్యధిక ర్యాంకులు సాధించాలని సివిల్స్ ఆశావాహులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచనతో సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి ‘రాజీవ్ అభయ హస్తం’ పేరుతో ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలని సూచించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు.....
రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్య సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.