Share News

కాంగ్రెస్ x బీఆర్‌ఎస్‌.. జిల్లాలో పదునెక్కిన రాజకీయ వేడి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:44 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.

కాంగ్రెస్ x బీఆర్‌ఎస్‌.. జిల్లాలో పదునెక్కిన రాజకీయ వేడి
Congress vs BRS

  • సవాళ్లు..ప్రతి సవాళ్లతో హల్‌చల్‌

  • ప్రభుత్వ వైఫల్యాలే గులాబీ పార్టీ అస్త్రం

  • అభివృద్ధి, సంక్షేమమే ప్రధానాంశమంటున్న హస్తం పార్టీ

బెజ్జూరు(మంచిర్యాల): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును ప్రధానాంశంగా కాంగ్రెస్‌ విజయోత్సవాలు జరుపుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలనే అస్ర్తాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇరు పార్టీల పోరు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకింది.


హామీల అమలుపై..

జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో ఆ పార్టీ వరుస నిరసనలు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. ఇలా పలు కార్యక్రమాలతో ప్రజలను ఆకర్శించేందుకు యత్నించడమే కాకుండా పార్టీ కేడర్‌ను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమమే రాజకీయంగా నిలదొక్కుకునే విధంగా మారిన నేపథ్యంలో ప్రధానాంశాలనే అస్త్రంగా మలు చుకున్న బీఆర్‌ఎస్‌ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తోంది.


కాంగ్రెస్‌ ఎదురుదాడి..

ప్రతిపక్షాల విమర్శలను అధికఆర కాంగ్రెస్‌ తిప్పి కొడుతోంది. సన్నబియ్యం, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ తదితర సంక్షేమ పథకాలే ప్రధానాంశంగా ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతోంది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ ఫలాలను వివరించేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అలాగే వెయ్యి రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనులను వివిద ప్రచఆర మాద్యమాల ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్‌ చేరవేస్తోంది. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన తప్పిదాలను తెరమీదకు తెస్తోంది.


mncl1.jpgరాబోయే రోజుల్లో..

జిల్లాలో రాబోయే రాజకీయ సమీకరణాలను నిర్ణయించేది సభలు, ప్లెక్సీలు, ఆరోపణలు మాత్ర మే కాదని విశ్లేషకులు అంటున్నారు. గ్రామాల్లో ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు... ఎవరి వెంట కేడర్‌ కదులుతోంది.. స్థానిక సమస్య లపై ఎవరు నిరంతరం పోరాడుతున్నారు? అన్నదే కీలకమనే అభిప్రాయపడుతున్నారు. వెయ్యి రోజుల పాలనను కాంగ్రెస్‌ అభివృద్ధి రిపోర్టుగా చూస్తుంటే, బీఆర్‌ఎస్‌ దానిని ప్రభుత్వ వ్యతిరేకతను కూడ గట్టుకునే రాజకీయ అవకాశంగా చూస్తోందని అంటు న్నారు. మొత్తం మీద జిల్లాలో మొదలైన వెయ్యి రోజుల పోరు భవిష్యత్‌ రాజకీయ ఆధిపత్యానికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ తన అధికార బలాన్ని, అభివృద్ధి ప్రచారంతో స్థిరీకరించుకోవాలని చూస్తుండగా, బీఆర్‌ఎస్‌ మాత్రం ఉద్యమా ల ద్వారా కోల్పోయిన రాజకీయ స్థలాన్ని తిరిగి సంపాదిం చుకోవాలని చూస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రాండెడ్ బ్యాగుల్లో రేషన్ రైస్

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 12:44 PM