Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్
ABN, Publish Date - May 07 , 2025 | 07:16 AM
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనను యావత్ భారతదేశంతో పాటు పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు సరైన సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్పై ఊహించని విధంగా భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి. పీవోకేలో 9 ప్రాంతాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లో మౌలిక సదుపాయాలను కూడా భారత దళాలు ధ్వసం చేశాయి. ఈ దాడిలో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మృతిచెందగా పలువురు గాయపడినట్లు సమాచారం.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
India Pak War: పాకిస్తాన్పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..
For National News And Telugu News
Updated at - May 07 , 2025 | 09:19 AM