Home » terrorist
కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది గోల్డీ బ్రార్(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.
సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
కేంద్రంలో శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వం ఉందని.. అందుకే మన సైనిక బలగాలు ఉగ్రవాదులను వారి నేలపైనే మట్టుబెడుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వారి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి మరీ చంపుతున్నాయని చెప్పారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని, వారిని పాక్గడ్డపైకి అడుగుపెట్టయినా సరే మట్టుబెడతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారంనాడు గట్టి హెచ్చరిక చేశారు.
ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.
సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) రాజధాని శ్రీనగర్(SriNagar)లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వలస కార్మికుడు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. బాధితుడు అమృతపాల్ సింగ్ పంజాబ్లోని అమృత్సర్ నివాసి.
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయోధ్యలో ఓ ఉగ్రవాది దాది ఉన్నారని సమాచారం ఇచ్చాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలియజేసింది.