Home » terrorist
బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన మొహమ్మద్ హమీమ్ మోండల్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో మోండల్కు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద ముఠా అరెస్ట్ అయ్యింది.
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ను విడుదల చేసింది.
గుజరాత్లో ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్లో 8 మందిని అరెస్ట్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.