Minister Uttam:హెలికాప్టర్లో పర్యటనలపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ
ABN , Publish Date - May 09 , 2025 | 08:38 PM
Minister Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో మంత్రులు పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.ఈ విమర్శలపై వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు హెలికాప్టర్లో పర్యటిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నేతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హెలికాప్టర్లో ప్రయాణిస్తే గంటకు 300 లీటర్ల ఫ్యూయల్ కాలుతుందని తెలిపారు. రూ.100లకు లీటర్ ఫుయల్ అవుతుందని చెప్పారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా లక్ష నుంచి రూ. 1.20 వేలు ఖర్చు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టే ఒక్కో కార్యక్రమానికి తాము ముగ్గురు లేదా నలుగురం మంత్రులం కలిసి వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. రోడ్డు మార్గంలో వెళ్తే పోలీసులు, అధికారులు, కాన్వాయి ఖర్చులు అన్ని ఇంతకు మంచి అవుతాయని తేల్చిచెప్పారు. సమయం కూడా చాలా పడుతుందని అన్నారు. హెలికాప్టర్ ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. తాము తిరిగే హెలికాప్టర్ గత కేసీఆర్ ప్రభుత్వమే లీజుకు తీసుకుందని గుర్తుచేశారు. తమకు అదనపు ఖర్చు కేవలం ఫ్యూయల్ ఖర్చేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల రివ్యూకు వెళ్తే ఆఫ్డేలో రివ్యూ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లి రివ్యూ చేయాలంటే నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ప్రజల పనులు త్వరగా పూర్తి చేయడానికేనని చెప్పారు. హెలికాప్టర్లో తిరగడం తమకు సోకు కాదన్నారు. ఇవన్నీ తెలిసి తాము విస్తృతంగా పర్యటిస్తూ పని చేస్తున్నామనే కడుపు మంటతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News