Share News

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

ABN , Publish Date - May 10 , 2025 | 12:41 PM

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం
MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు: పాకిస్థాన్ ఉన్మాదులు ఉగ్రవాదంతో భారతదేశాన్ని బయపెట్టాలని చూస్తే.. తమ దేశంలో బయపడేవాళ్లు ఎవరూ లేరని.. తిరిగి గట్టిగా సమాధానం చెబుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది (MLA Kotamreddy Sridhar Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ మహిళల సిందూరాన్ని చేరిపేయడానికి పాకిస్థాన్ చేసిన తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దు:ఖంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చారని తెలిపారు. పాకిస్తాన్ భారతదేశంతో ఎన్నో యుద్దాలు చేసిందని.. కానీ ఒక్కటి కూడా గెలవలేక పోయిందని చెప్పారు. అయినా కూడా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ది రావడం లేదని మండిపడ్డారు. కేవలం మూడు రోజుల్లోనే భారతదేశ పౌరుషాన్ని పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూపించారని చెప్పారు. పాకిస్థాన్‌పై భారతదేశం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలో ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ తుడిచిపెట్టుకు పోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది హెచ్చరించారు.


పాకిస్థాన్‌‌తో యుద్ధంలో అమరుడైన భారత సైనికుడు మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికి మరచిపోమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు. ఇవాళ(శనివారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా యంఎస్ఏంఈ పార్క్ శంకుస్తాపన జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది మాట్లాడారు. యంఎస్ఏంఈ పార్క్‌కు భరత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా నామకరణం చేశామని తెలిపారు. భారత్ మాతాకి జై.. ఖబర్దార్, ఖబర్దార్ పాకిస్థాన్ అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ, అతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు.


60 ఎకరాల్లో యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని.. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదివేల మందికి ఉపాధి అవకాశం లభించనుందని వెల్లడించారు. నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తన దగ్గరకు వస్తే 48 గంటల్లో అన్ని అనుమతులు ఇప్పిస్తానని అన్నారు. దేశంలో ఇతర యంఎస్ఏంఈ పార్కులను సందర్శించి అక్కడ లభించే సబ్సిడీలు ఇప్పిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

Airport Security Alert: ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌

Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి

For More AP News and Telugu News

Updated Date - May 10 , 2025 | 12:54 PM